సాహిత్యం పోను పోనూ నిర్దిష్టం అయ్యి తీరాలని అనుకుంటాను. సాధారణీకరణ అన్నది ఎంత తగ్గితే అంత మంచిది. ఈ నిర్దిష్టత మానవ సంబంధాల గురించి కావచ్చు, స్థల కాలాల గురించి కూడా కావచ్చు. ఈ మౌలికమయిన పునాది మీదనే కొత్త సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సాహిత్యం గురించి వున్న అనేక అపోహలూ, అపార్థాలూ కేవలం ఈ నిర్దిష్ట తాత్వికత అర్థం కాకపోవడం వల్లనే అనుకుంటున్నాను. అయితే, ఏది సాహిత్యం అవుతుంది ఏది కాదు అన్న సునిశిత అవగాహన రచయితలకి వుండి తీరాలి. ఉదాహరణకి తెలంగాణ సాహిత్యం తీసుకుంటే, రాజకీయాలలో కె సి యార్ చెప్పింది వేదం అయినా నష్టం లేదు కానీ, సృజనాత్మక రచయిత కూడా అదే వేదం అనుకుంటే ప్రమాదం. రచయితలు రాజకీయాలు మాట్లాడాలి కానీ, రాజకీయ ఎత్తుగడల వలలో చిక్కు పడకూడదు అనుకుంటా. రచయిత రాజకీయాలు మాట్లాడుతూనే తన స్వేచ్చని కూడా కాపాడుకోగలిగితేనే రచనా సమగ్రత నిలుస్తుంది. వట్టికోట , దాశరథి, కవిరాజమూర్తి లాంటి రచయితలు ఆ సమగ్రతని కాపాడుకోగలిగారు కాబట్టే వాళ్ళ రచనలు ఉద్యమాలు చల్లారినా వేడిగా వున్నాయి. ఈ విషయంలో నాకు ఉర్దూ అభ్యుదయ రచయితలూ కవులూ ఆదర్శంగా కనిపిస్తారు. తెలంగాణ తనకి వున్న ఉర్దూ బంధుత్వం నించి నేర్చుకోవాల్సింది ఇదే.
(మిగిలిన భాగం "పొద్దు"లో...http://www.poddu.net/?q=node/775)
Subscribe to:
Post Comments (Atom)
అలజడికి అక్షర రూపం- సాహిల్
-పి. జ్యోతి "సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇ...
-
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...
-
ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక ...
-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
1 comment:
nice analysis
Post a Comment