Monday, November 22, 2010

"కథతో ఒక రోజు" కరపత్రం తరవాత ...ఏం జరిగింది?

ఆంధ్రా 'కథతో ఒకరోజు' ఆంధ్రాలో పెట్టుకోండి! -కరపత్రం విడుదలయ్యాక మరునాడు సభ అనంగా, వాసిరెడ్డి నవీన్‌ 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం బాధ్యులైన డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ లకు, తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్‌ పరవస్తు లోకేశ్వర్‌కు వేరువేరుగా ఫోన్లు చేసి తాను తెలంగాణకు మద్దతుగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం జరిగిందని, రేపు మీటింగ్‌ సజావుగా జరగడానికి సహకరించమని, అందుకు ఇంకా ఏమి చేయాలని అడిగారు. మరి ఇప్పటివరకు తెలంగాణ రచయితలకు జరిగిన నష్టం ఎలా పూడుతుందని అడిగాము. 14మంది వక్తల్లో కేవలం ఇద్దరినే తెలంగాణవారిని పెట్టడం గురించీ అడిగాము. మీటింగ్‌ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని నవీన్‌ అన్నారు. సరే, సింగిడి సభ్యులము మాట్లాడుకొని చెబుతామన్నాము. తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌ నాలుగు విషయాలు నవీన్‌కు చెప్పడం జరిగింది. 1.సభలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేయాలి. 2. కరపత్రంలో 'సింగిడి' లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలి. 3. కరపత్రాలు సభా ప్రాంగణంలో పంచుకుంటాము. 4. మీటింగ్‌ తర్వాత కలిసి 20 ఏళ్లుగా తెలంగాణ రచయితలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. -వీటన్నింటికీ వాసిరెడ్డి నవీన్‌ ఒప్పుకున్నారు.
ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో- 'సింగిడి' వారు కోరినట్లుగా తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి అరమరికలు లేకుండా మద్దతు తెలియజేస్తున్నామని, కథల ఎంపికకు సంబంధించి, సంకలనాల లోటుపాట్ల గురించి సాహిత్య చర్చల ద్వారా నిర్ణయించుకోవచ్చునని -నవీన్‌ అన్నారు.
మీటింగ్‌ రోజు ఆరేడుగురు సింగిడి సభ్యులు వెళ్లి కరపత్రాలు పంచి వచ్చేశారు. సింగిడి సభ్యులు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 20 మంది పోలీసులు అక్కడికి చేరుకుని సభకు రక్షణగా నిలుచున్నారు. ముగ్గురు నలుగురు తప్ప తెలంగాణ రచయితలంతా సభను బాయ్‌కాట్‌ చేశారు. రాలేదు. ఆశించినంతమంది సభకు రాలేదని, 150కి పైగా సాహిత్యకారులు వస్తారనుకుని నిర్వాహకులు భోజనాలు చెప్పారని, కేవలం 50 మందే వచ్చిఉంటారని, చివరి సెషన్‌ మరీ వెలవెలా పోయిందని తెలిసింది.
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న విషయమే వాసిరెడ్డి నవీన్‌ మళ్లీ మళ్లీ అందరికీ చెప్పారు కానీ అదొక్క విషయమే సింగిడి లేవనెత్తలేదు, 20 ఏళ్లుగా తెలంగాణలో ఎదగాల్సిన కథకు, కథకులకు ఎనలేని నష్టం కథాసాహితి చేసిందని మేము కరపత్రంలో చెప్పాం. అట్లే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కరపత్రంలో ఉన్న విషయం గమనించవచ్చు.
- 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
http://skybaaba.blogspot.com/2010/11/blog-post_3591.html నుంచి

2 comments:

శరత్ కాలమ్ said...

ప్చ్...ప్చ్!

Anonymous said...

ఈ నడుమ ఇంత ఘోరమయిన సాహిత్య సభ చూడలేదు. శ్రోతల కంటే వక్తలు ఎక్కువ!

సురేశ్

అలజడికి అక్షర రూపం- సాహిల్

  -పి. జ్యోతి "సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇ...