Dasu Krishnamoorty responds to debate on editors

I believe editing is a subjective art that shuns definition. But essentially it is gate keeping. Before a story gains admission it has to get past two gates: the editor and the publisher. When a publisher chooses an editor he sets the guidelines. The editor/publisher is only exercising his right to free expression when he accepts/rejects a story. Both of them in the end go by a gut feeling of what the reader accepts or rejects. The goal of selection is salability. The selection process is subjective as is evident from the different criteria employed by different publishing houses. Just as a newspaper reporter concedes the right of the copy editor to spike or change his copy, the writer has to respect the right of the editor/publisher because they absorb the losses from poor sales.

Editors at publishing houses have guidelines laid down by the publisher. The publisher sets them on the basis of feedback he gets from the reader. Both in newspapers and book industry it is ultimately the reader who is the king. The preferences of the reader change from time to time and from region to region. It is enough if the editor is aware of these changes and knows what the readers want. Readability is the main criterion and determining it is a subjective process. For example, even if the editor finds Lajja of Taslima Nasreen a great work, he may not recommend it for fear of hostile reaction. The editor failed to us it for reasons other than merit. I think the debate has its roots in writers’ conceit.

I will cite our experience as editors/translators of an anthology we had recently published to bolster my views.

We run a web magazine that publishes two/three short stories every month. We have a number of Telugu anthologies with us from which we, as readers, choose some stories. Over a period we published around 75 stories in the magazine. It occurred to us that publishing an anthology would be a good idea to celebrate the hundredth birthday of the Telugu short story. From the 75 stories we chose 22 and sent them to three publishers. Two of them agreed to publish. Since Rupa and Co. was the first to approve our collection we sent the manuscripts to Rupa, prepared to abide by the verdict of their editors. They approved all the stories submitted and made no changes that deserved to be called a change.
Before submitting the stories we edited them besides translating them. We deleted repetitive passages, deleted excessive schmaltz, slashed padding and removed clichéd phrases like nadaka laanti parugu. Coming to additions, we added descriptive details and setting where we thought it was necessary. In one story there was childbirth. We employed medical jargon and also described the room and the things found in such a room at delivery time. A client visits a lawyer. We described the lawyer’s office, the glass-fronted shelves containing All India Law Reporter volumes, a framed picture of Venkateswara Swami or Satya Saibaba. In many stories we found that participants in a dialogue did nothing but talk. First, they are talking on a road, or a railway station or in a house. The place has to be described and the interruptions in the dialogue. We did these things and sent the edited stories to the writers for approval.
I somehow think that the debate on criteria for editors originated in rejections. No writer has a right to insist that his story be accepted or when accepted should not be changed. One of the two short story icons of the later half of twentieth century Raymond Carver had his stories nearly rewritten by Gordon Lish at Knopf. Editors at leading publishing houses reject hundreds of works and suggest drastic changes on acceptance. Rupa has accepted our work. Now it is for the readers to accept it. We will not complain if the readers reject it. About our selection Katha Naveen had reservations. We admit he has a right to do that. Since I do not know what set off the debate on editing, I presume it is a grapes are sour story.

Dasu Krishnamoorty

రాజకీయాలూ..సాహిత్యం గురించి!

సాహిత్యం పోను పోనూ నిర్దిష్టం అయ్యి తీరాలని అనుకుంటాను. సాధారణీకరణ అన్నది ఎంత తగ్గితే అంత మంచిది. ఈ నిర్దిష్టత మానవ సంబంధాల గురించి కావచ్చు, స్థల కాలాల గురించి కూడా కావచ్చు. ఈ మౌలికమయిన పునాది మీదనే కొత్త సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సాహిత్యం గురించి వున్న అనేక అపోహలూ, అపార్థాలూ కేవలం ఈ నిర్దిష్ట తాత్వికత అర్థం కాకపోవడం వల్లనే అనుకుంటున్నాను. అయితే, ఏది సాహిత్యం అవుతుంది ఏది కాదు అన్న సునిశిత అవగాహన రచయితలకి వుండి తీరాలి. ఉదాహరణకి తెలంగాణ సాహిత్యం తీసుకుంటే, రాజకీయాలలో కె సి యార్ చెప్పింది వేదం అయినా నష్టం లేదు కానీ, సృజనాత్మక రచయిత కూడా అదే వేదం అనుకుంటే ప్రమాదం. రచయితలు రాజకీయాలు మాట్లాడాలి కానీ, రాజకీయ ఎత్తుగడల వలలో చిక్కు పడకూడదు అనుకుంటా. రచయిత రాజకీయాలు మాట్లాడుతూనే తన స్వేచ్చని కూడా కాపాడుకోగలిగితేనే రచనా సమగ్రత నిలుస్తుంది. వట్టికోట , దాశరథి, కవిరాజమూర్తి లాంటి రచయితలు ఆ సమగ్రతని కాపాడుకోగలిగారు కాబట్టే వాళ్ళ రచనలు ఉద్యమాలు చల్లారినా వేడిగా వున్నాయి. ఈ విషయంలో నాకు ఉర్దూ అభ్యుదయ రచయితలూ కవులూ ఆదర్శంగా కనిపిస్తారు. తెలంగాణ తనకి వున్న ఉర్దూ బంధుత్వం నించి నేర్చుకోవాల్సింది ఇదే.


(మిగిలిన భాగం "పొద్దు"లో...http://www.poddu.net/?q=node/775)
Category: 1 comments

ఎడిటర్లకి కావాల్సిందేమిటి?: మాగంటి వంశీ

క్లుప్తం అని బంధాలేస్తే ఎలా చచ్చేది? సరే నాలుగైనా, నలభై ఐనా క్ఌప్తం నాకు లుప్తమే కాబట్టి..ఈ నలభై ముక్కలు....

ఆనాటి సంపాదకత్వం - సాహితీ సేవకొక పీఠం
ఈనాటి సంపాదకత్వం - సంపాదనకొక మార్గం

సంకలనమో, సంగ్రహమో ఏదైనా సరే - ఈనాటి సంకలన సంపాదకులకు కావలసినదేమిటి? డబ్బు పోగెయ్యటం, తల ఎగరెయ్యటం, పోట్లు పొడవటం

అందరూ ఊరుకుంటారా? - ఎవడన్నా తిరిగి పొడిస్తే రాజీకి రావటం.

పాతవారు సరే, చరిత్రలోకెక్కిపోయారు వారి ప్రతిభతో మఱి ఇటీవలి కాలం వారు? అమెరికాలోనో, యూరపులోనో ఉండటం - వారి స్వంత డబ్బులు దాచుకోవటం. పఱుల డబ్బులు దొబ్బటం, తందనాలాడటం, ఆంధ్ర దేశంలో రియల్ ఎస్టేటు కొనుక్కోవటం. మాట వినకపోతేనూ, ఎదురు చెపుతేనో మీద పడి రక్కటం, దుష్ప్రచారాలు చెయ్యటం. పాఠక హక్కుల హననం చెయ్యటం.సాహిత్యానికి సమాధి కట్టటం.? ఎలా? అలాగే!
......
.............
................................
....................................................


మరి ఈ చర్చలో పాల్గొనటానికి అర్హతలేమిటీ? డబ్బుల కోసం పీడింపబడ్డవారు, సంకలనాలు చదివి గుండెపోటు వచ్చిన వారు, సంకలన సంపాదక నటరాజ తాండవ నర్తనానికి బలి అయిపోయిన తాడిత జనాభా వారు, వారి కులకంపుకు కళ్లు బైర్లు కమ్మినవారు.....ఇలా బోల్డంతమంది అభాగ్యులు, నిర్భాగ్యులు, కండలు పీక్కుతినే అఘోరా సాధువులు - వీరందరూ అర్హతలున్నవారే!

మరి ఎడిటర్లకు కావల్సిందేమిటి ? – పరిశీలనా శక్తి, నైశిత్యం సాహిత్య పైత్యం, రస ప్రకోపం. వ్యుత్పత్తి, అభ్యాసం, తప్పులు దిద్దటంలో అపారమైన పరిణితి. నిజమైన సాహితీ సేవ చెయ్యాలన్న నిర్దిష్ట తపన. వివిధ మనస్తత్త్వాలు కల సాహితీవేత్తల మధ్య అభిప్రాయభేదాలు తొలగించగల నైపుణ్యం. తత్కాల, దీర్ఘకాల స్వప్రయోజనాల దృష్ట్యా ఒక వర్గానికి కొమ్ము కాయకపోవటం.చుట్టఱికం, దగ్గరగా కూర్చుని చుట్ట కాల్చడం వల్లే వచ్చిందన్న దాన్ని నమ్మకపోవడం. అలా చుట్టలు కాల్చేవాళ్లని దగ్గరికి రానివ్వకపోవటం.సాధికారంగా, వివరణాత్మకంగా లోపాలు ఎత్తి చూపించగలగటం. రచయిత ఒప్పుకోకపోతే ఆ రచనని ఎత్తి చెల్లికి మళ్లీ పెళ్లి కాయితాల సహవాస భాగ్యం కల్పించటం.మంచి కథలు దొరకకపోతే ఆ సంకలనం మానుకోవటం.మంచివి దొరికినప్పుడే సంకలిద్దాం అని లోపలా బయటా ఆశావాదిగా ఉండగలగటం.సంకలన ప్రచురణ వల్ల వచ్చే ఉపయోగంలో సద్వినియోగ శాతం గుర్తించగలగటం.ఆ ఉపయోగాన్నీ, సద్వినియోగాన్నీ మరు సంకలనానికి మెట్టుగా ఎలా వాడుకోవాలో తెలియటం.సంకలనానికొచ్చిన కథల్లో ఈనెలన్నీ తీసి తమలపాకే మిగలకుండ ఉండే పని చెయ్యకపోవటం.డబ్బు, పేరు, ప్రతిష్ట అనే మానసిక వ్యాధికి దూరంగా ఉండగలగటం.ప్రచురణ డబ్బుల కోసం అదేపనిగా ప్రజలని ఈమెయిళ్లతో పీడించకపోవటం.ఈమెయిళ్లకు జవాబివ్వకపోతే ఫోన్లు చేసి మరీ అడుక్కోకపోవడం.

మఱి పీడిత జనాభానో? పీడిత పాఠకులలో రెండు రకాలు - బలహీనులు, బలవంతులు.బలహీనులు ఏరకంగా ? బలవంతులు ఏ రకంగా? విద్య, సాహిత్య పరిచయం - - ఇవే బలాలు, అవి లేకపోతే బలహీనాలు.

బలహీన పాఠకుడికి మిగిలేదేమిటి? - నెత్తికి చేతులు, గుడ్లలో నీఱు, గుండెకు దడ, చేతికి చముఱు. బలవంతుడు ఈ మోత నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీడికి కొద్దిగా బుఱ్ఱ ఉన్నది కాబట్టిన్నూ, విద్యతో పాటుగా అవసరమైతే మర్మభేదం, దండోపాయం, మాటల ఈటెలు, ఎకసెక్కాలు ఉపయోగించన్నా తప్పించుకోగల నేర్పు ఉండబట్టిన్నూ. బలహీనుడికి ఆ అవకాశం మృగ్యం. చలికాలంలో అర్ధరాత్రి బట్టల్లేకుండా బయటకెళ్లి పళ్లు టకటకలాడుతున్నా శబ్దం బయటికి రాదుగా!

మఱి రచయితలూ నిరసన ప్రకటిస్తూనే ఉన్నారుగా? వాడి కథ ఆ సంకలనానికెక్కలేదని ఒహడి బాధైతే, ఇంకోడిది ఎక్కిందన్న బాధతో ఒహడు, ఆ సంకలనం చేసినవాడి కులం నాది కాదు కాబట్టి రాళ్లు విసిరి దుగ్ధ తీర్చుకుందామన్న కుతితో ఒహడు...

మఱి అప్పటిదాకా నిద్రపోతున్న సంఘాలు? కుంభకర్ణుడు ఉంటేనేం, చస్తేనేం? ఎవడికి ఉపయోగం? ఒక్క ఆ రావణాసురిడికి తప్ప - మధ్య మధ్యలో లేవటం, అరవటం, మెక్కటం, మళ్లీ పడుకోటం . తెలంగాణోళ్ల సంఘమైతేనేమి, ఆంధ్రోళ్ల సంఘమైతేనేమి? అన్నీ ఆ తీరే!

అవకాశం దొరికితే అవతలివాడిని ఎక్కుదామని చూసేవాళ్లు ఎలా పోతే మనకేంటి? మఱి నువ్వు ఇప్పుడు చేసిన పని అదేగా అంటున్నారు జనాలు! అవును! ఆ అవకాశం ఇచ్చిన అఫ్సర్ గారికి బోల్డు ధన్యవాదాలతో!

అర్థం పర్థం లేకుండా, వందల సంఘాలున్నాయి, వేలాది రచయితలున్నారు - ఊపునివ్వాలి, విరగపొడవాలి అంటూ బాకా ఊదుకుంటూ తిరక్కపోతే గత నాలుగైదు దశాబ్దాలుగా చెయ్యని, చెయ్యలేని పని - సందు దొరికింది కదాని ఊరకే మొఱిగే బదులు బుద్ధి తెచ్చుకుని కాపలా కాస్తే ఇంకో యాభై ఏళ్లకైనా తమ ప్రాంత రచయితలకు మేలు చేసినవారవుతారు, సాహితీ సేద్యాన్ని నిలబెట్టినవారవుతారు.

రాజీకి రాకుండా మాకు నచ్చినవాళ్లవే వేసుకుంటాం,మాకు నచ్చినవాడే రచయిత, వాడి రచనే రచన, వాడి కథే కథ అని ఈ ఆంధ్ర సంఘం వాళ్లు అనటానికి దమ్ములూ లేవు...చేసిన తప్పు తెలుసుగా! కుక్కిన పేనన్నా నయం! బీరాలు పోవటం, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటం, నచ్చనివాడిని వెలివెయ్యటం మానుకుని అసలు మొదలెట్టినప్పటినుంచి అందరినీ కలుపుకుని, అన్ని ప్రాంతాల వారికి సమాన ప్రాతినిధ్యమిచ్చుంటే పోయేది. ఆ పనీ చెయ్యలా, పోనీ మా సంకలనాలు మా ప్రాంతం వాళ్లకి మటుకే అని ఓ డిస్క్లెయిమరూ పెట్టలా ! ఇప్పుడు ఆకులు పట్టుకుంటే మిగిలేది ఏమిటి? పానకం బిందె!

ఇహ ఇంతటితో ఆపుతున్నా - రాండి మీద పడండి.....రాండి...కాచుకుని కూర్చున్నా !

మాగంటి వంశీ
Category: 2 comments

సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా?! : చర్చకి ఆహ్వానం

"సింగిడి" కరపత్రం ఒక ముఖ్యమయిన విషయాన్ని చర్చకి తీసుకు వచ్చింది. ఈ ప్రకటన బ్లాగులో పెట్టినప్పుడు నా వుద్దేశం కేవలం కథ చుట్టూ జరుగుతున్న రాజకీయాలని చర్చించడమే. సింగిడి తెలంగాణ రచయితల సంఘం వారు లేవనెత్తిన ప్రశ్నలు నిజానికి చాలా వివాదాస్పదమయినవి. చర్చించదగినవి. కథలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పనిచేస్తాయన్నది వొక ముఖ్య విషయం అయితే, అసలు కథల ఎంపికలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పని చేస్తాయన్నది ఇందులో ప్రధాన చర్చ. నవీన్, శివశంకర్ ల "కథ" సంకలనాలు ఒక ట్రెండ్ని సృష్టించాయి. ఇవి ఎంత బలమయిన ముద్ర వేసాయో నేను నా విమర్శ పుస్తకం "కథ-స్థానికత" లో వివరంగానే చర్చించాను.

కానీ, తరవాతి కాలంలో "కథ" సంకలనాలు వాటి గౌరవాన్ని కోల్పోయాయని చెప్పక తప్పదు. వివిధ ప్రాంతాల రచయితలే కాకుండా, అసలు ఏ ప్రాంతానికీ చెందని రచయితలు కూడా కొంత కాలంగా కథ సంకలనాల మీద ఏదో వొక రకంగా నిరసన ప్రకటిస్తూనే వున్నారు, ఆ సంపాదకుల కథల ఎంపికని ప్రశ్నిస్తూనే వున్నారు.

సింగిడి లేవనెత్తిన ప్రశ్న ముఖ్యంగా అదే.

సింగిడి కరపత్రం మీద "అక్షరం"లో జరుగుతున్న చర్చలో చాలా మంది ఇతర అభిప్రాయాలు చెబుతున్నారు. ఇక్కడ వేరే ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి.


సంకలనం సంపాదకులకు కనీస అర్హతలు కొన్ని వుండాలన్నది ఇక్కడ చాలా మంది తమ వ్యాఖ్యల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయం రావడంలో తప్పేమీ లేదు. తెలుగులో సంకలనాలకి గొప్ప సాంప్రదాయం వుంది. చరిత్ర వుంది. కథ సంకలనాలు తీసుకువచ్చిన వారంతా మౌలికంగా రచయితలు, విమర్శ రంగంలో కృషి చేసిన వారు. ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం పోతోంది. ఎవరయినా సంపాదకుడు/ ఎడిటర్ కావచ్చు అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది.


ఈ విషయం మీద చర్చ మొదలెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో సంకలనాల బెడద కూడా ఎక్కువయిపోయిందని కొందరు ఇతర బ్లాగ్మిత్రులు రుద్ర తాండవం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాగంటి వంశీ లేవనెత్తిన ప్రశ్నలు కూడా చర్చించ దగినవి. ఈ చర్చలు సాహిత్య/ సాహిత్యేతర అంశాలని కూడా ప్రస్తావిస్తున్నాయి.

ఇప్పుడు ఒకే ఒక సూటి ప్రశ్న ఏమిటంటే:

సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా? వుండాలి అనుకుంటే ఆ అర్హతలు ఏమిటి?

మీ జవాబులు క్లుప్తంగా రాయండి.


ఇక, ఈ వ్యాఖ్యలలో కొందరికి నా సమాధానాలు:


@నర్సింహ మూర్తి గారు;

ఎలా వున్నారు?

మీరన్నది నిజమే. కొంచెం వేడి వుంటే నష్టం ఏమీ లేదు. కానీ, ఇప్పటి దాకా కనీసం ఇరవై వ్యాఖ్యలు - అసభ్యత, అనాగరికం - అనుకున్నవి తీసేయ్యాల్సి వచ్చింది.

చాలా మంది ఒకే ఒక వాక్యంలో జిందాబాద్, వర్ధిల్లాలి, ముర్దాబాద్ అన్నట్టు రాస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ఈ ఏక వాక్య విమర్శ విధానం పోవాలని నేను కోరుకుంటున్నా.

పైగా, ఇక్కడ నేను చర్చించాలనుకున్న విషయం వేరు. ప్రతిస్పందనలు వేరుగా వున్నాయి. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. వ్యక్తుల మీద ఇంత బలమయిన ఇష్టానిష్టాలు వుంటాయా అని ఆశ్చర్యంగా వుంది.

తెలంగాణలో ఏం జరుగుతోంది?

"తెలుగు" సాహిత్యానికి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోందన్నది చాలా అవసరమయిన ప్రశ్న. "సింగిడి" తెలంగాణ రచయితల సంఘం కరపత్రం వివాదం ఇంకా సాగుతూ వుండగానే, తెలంగాణా రచయితలు మరో అడుగు ముందుకు వేస్తున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ కింద కార్యాచరణకి సిద్ధం అవుతున్నారు.





"కథతో ఒక రోజు" కరపత్రం తరవాత ...ఏం జరిగింది?

ఆంధ్రా 'కథతో ఒకరోజు' ఆంధ్రాలో పెట్టుకోండి! -కరపత్రం విడుదలయ్యాక మరునాడు సభ అనంగా, వాసిరెడ్డి నవీన్‌ 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం బాధ్యులైన డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ లకు, తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్‌ పరవస్తు లోకేశ్వర్‌కు వేరువేరుగా ఫోన్లు చేసి తాను తెలంగాణకు మద్దతుగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయడం జరిగిందని, రేపు మీటింగ్‌ సజావుగా జరగడానికి సహకరించమని, అందుకు ఇంకా ఏమి చేయాలని అడిగారు. మరి ఇప్పటివరకు తెలంగాణ రచయితలకు జరిగిన నష్టం ఎలా పూడుతుందని అడిగాము. 14మంది వక్తల్లో కేవలం ఇద్దరినే తెలంగాణవారిని పెట్టడం గురించీ అడిగాము. మీటింగ్‌ తర్వాత అన్నీ మాట్లాడుకుందామని నవీన్‌ అన్నారు. సరే, సింగిడి సభ్యులము మాట్లాడుకొని చెబుతామన్నాము. తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్‌ నాలుగు విషయాలు నవీన్‌కు చెప్పడం జరిగింది. 1.సభలో తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తీర్మానం చేయాలి. 2. కరపత్రంలో 'సింగిడి' లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలి. 3. కరపత్రాలు సభా ప్రాంగణంలో పంచుకుంటాము. 4. మీటింగ్‌ తర్వాత కలిసి 20 ఏళ్లుగా తెలంగాణ రచయితలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. -వీటన్నింటికీ వాసిరెడ్డి నవీన్‌ ఒప్పుకున్నారు.
ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో- 'సింగిడి' వారు కోరినట్లుగా తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి అరమరికలు లేకుండా మద్దతు తెలియజేస్తున్నామని, కథల ఎంపికకు సంబంధించి, సంకలనాల లోటుపాట్ల గురించి సాహిత్య చర్చల ద్వారా నిర్ణయించుకోవచ్చునని -నవీన్‌ అన్నారు.
మీటింగ్‌ రోజు ఆరేడుగురు సింగిడి సభ్యులు వెళ్లి కరపత్రాలు పంచి వచ్చేశారు. సింగిడి సభ్యులు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి దాదాపు 20 మంది పోలీసులు అక్కడికి చేరుకుని సభకు రక్షణగా నిలుచున్నారు. ముగ్గురు నలుగురు తప్ప తెలంగాణ రచయితలంతా సభను బాయ్‌కాట్‌ చేశారు. రాలేదు. ఆశించినంతమంది సభకు రాలేదని, 150కి పైగా సాహిత్యకారులు వస్తారనుకుని నిర్వాహకులు భోజనాలు చెప్పారని, కేవలం 50 మందే వచ్చిఉంటారని, చివరి సెషన్‌ మరీ వెలవెలా పోయిందని తెలిసింది.
తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్న విషయమే వాసిరెడ్డి నవీన్‌ మళ్లీ మళ్లీ అందరికీ చెప్పారు కానీ అదొక్క విషయమే సింగిడి లేవనెత్తలేదు, 20 ఏళ్లుగా తెలంగాణలో ఎదగాల్సిన కథకు, కథకులకు ఎనలేని నష్టం కథాసాహితి చేసిందని మేము కరపత్రంలో చెప్పాం. అట్లే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కరపత్రంలో ఉన్న విషయం గమనించవచ్చు.
- 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
http://skybaaba.blogspot.com/2010/11/blog-post_3591.html నుంచి
Category: 2 comments

నన్ను "నేను"గా తీర్చి దిద్దింది అమెరికా : కలశపూడి శ్రీనివాస రావు గారితో "అక్షరం"


అమెరికా తెలుగు కథకులలో సీనియారిటీకి చేరుకున్న కథకులు కలశపూడి శ్రీనివాస రావు గారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీ గా వుండే శ్రీనివాస రావు గారు కేవలం రచయితే కాదు, నలుగురికీ సాయపడాలన్న తపన వున్న వ్యక్తి. అక్షరం ముక్క రాయకుండా కూడా మహా సాహిత్యవేత్తల్లాగా వుపన్యాసాలు దంచుతూ, పరుల కోసం ఒక్క డాలరు కూడా ఖర్చు పెట్టకుండా మహా రాజ పోషకత్వం వహించే మహన్న భావులు కొల్లలుగా వున్న గంజాయి వనంలో అచ్చంగా తులసి మొక్క కలశపూడి. ఆయన విస్తృతంగా రాయకపోవడం మన దురదృష్టమే!

శ్రీనివాస రావు గారి బ్లాగు :

http://sahityakalasam.blogspot.com/


1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అవును చదువు, పని, బ్రతుకు ముప్పెటలా కలసి పోయి నాకు తెలియ కుండానే నన్ను ‘నేను’ గా తీర్చి దిద్దింది అమెరికా. దాని వలన జీవితం పట్ల నా దృష్టిలో మార్పు వచ్చింది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
జీవితం పట్ల నా దృష్టిలో వచ్చిన మార్పు, ఆలొచనల్లొ విశాలత్వం ఆచరణలొకి అనువదిచడానికి సహాయం అవుతూ వచ్చింది. ఇప్పటివరకూ ప్రచురించబడ్డ నా 45 రచనలలో ( కథ, కవిత, గల్పిక, నాటకం, నవల, వ్యాసాలలో) ఈ విషయం పరిణామం చెందుతూ వచ్చింది. ‘ మీ ఆవిడని కొట్టారా ?’ కథ లో ఒక పాత్ర లో మార్పు మాత్రమే చూడగలిగిన నేను ‘మా వూరి మంత్రి శతకం ‘ లో సమాజం లో మార్పు చూడగలిగాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఆంద్రా లో ఉన్నప్పుడు వ్రాసినవి కవితలు. అదంతా భావకవిత్వం. సరదాగా, రాయగలనని తెలిసి రాసి చూసుకొందామని వ్రాసినవి. అచ్చు లో చూసుకోవాలని కూడా అనిపించలేదు. కారణం నేను వ్రాసిన వాటికంటే నేను చదివినవే చాలా బాగున్నాయనిపించడం కాబోలు. అమెరికా లో వ్రాసినవే నలుగురితో పంచుకోవాలన్పించి, సారస్వత సమూహాలలో చదవడం, ఇక్కడ పత్రికలకి పంపడం, తర్వాత అక్కడ పత్రికలకి పంపడం జరిగింది.
4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
‘వెయ్య కిటికీలు ‘ జీవితం ఒక వెయ్య కిటికీల భవంతిలా తోచింది అమెరికా జీవితం. ఎంతోమందిని కలవడం , వారి వారి ప్రపంచలోకి తెలుపులు తెరిచి రమ్మనమని స్నేహపూర్వక ఆహ్వానం ఇవ్వడం, ఆనందాన్ని, ఆలోచనల్ని, అనుభవాలని అలవోకగా ఇవ్వడం జరుగుతున్నా నేపథ్యంలో ఈ బ్రతుకుకి వెయ్యకితికీలు ఉన్నాయ్. తెరిచి చూడడం నేను చెయ్యవలసిన పని అని తెలుసుకున్న సమయంలో వ్రాసిన రచన అది.

5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
స్పటికం లాంటి మనిషి మెదడుమీద కాంతి లాంటి ఒక ఆలోచన వచ్చి ఇంద్ర ధనస్సులాంటి ఊహల్ని సృస్తి స్తుంటే వెలువడే సాహిత్యంకి భాష, భౌగొళిక హద్దులు ఉండవు. పరిశోధకుల పరిశోధనల కోసం తగిలించి పదం డయాస్పోరా సాహిత్యం అని నా అభిప్రాయం. రాసేవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో రచయత తరగతిలో సీటు ఇవ్వాలంటే డయాస్పోరా సాహిత్య విభాగం అవసరమే. అమెరికా నుండి వస్తున్నా తెలుగు సాహిత్యం లో చాలా భాగం డయాస్పోరా సాహిత్యమే.
6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
మీరు రచయతగా నా భవిస్యత్తు అని అడుగుతున్నారని భావించి ఈ జవాబు ఇస్తున్నను. అమెరికా వాతావరరం ఎన్నోవిధాలుగా రాసేవారికి రాయడానికి అవకాశాలని ఇస్తుంది. దానిని నేను ఆవగింజంత కూడా ఉపయోగించుకోవడంలేదు. భవిష్యత్తులో బత్తాయి అంత కాకపోయినా బ్లూ బెర్రీ అంతైనా బ్లాగ్ బరిలో ఉపయోగించుకోవాలని అనుకొంటున్నాను.
Category: 3 comments

కథ చుట్టూ రాజకీయాలు..!

ఈ కరపత్రం హైదారాబాద్ లోని కొంత మంది ద్వారా నా దృష్టికి వచ్చింది. వొకే వొక్క రోజులో నాకు పాతిక మంది ఈ కరపత్రాన్ని నాకు ఈ-లేఖల ద్వారా పంపారు. ఇంత ప్రతిస్పందన ఎందుకు వచ్చిందా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ, ఇది ఇతర సాహిత్య మిత్రులకి తెలిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది నా బ్లాగులో పెట్టాను.

సింగిడి రచయితల సంఘం ఇటీవల చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న తెలంగాణా రచయితల వేదిక. తెలంగాణాలోని అనేక వర్గాల రచయితలూ, కవులూ, విమర్శకులూ పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఈ సంఘం కింద పనిచేస్తున్నారు. తెలంగాణా రచనల పట్ల కొనసాగుతున్న వివక్షని ఈ సంఘం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఈ కరపత్రం ఇప్పుడు తెలంగాణాలో విస్తృతంగా ప్రచారంలో వుంది. "అక్షరం"లో ఈ కరపత్రాన్ని ప్రచురించాల్సిందిగా సింగిడి రచయితలు, అనేక మంది తెలంగాణ రచయితలు కోరడం వల్ల దీన్ని నా బ్లాగులో ప్రచురిస్తున్నాను.

ప్రచురించిన వెంటనే ఈ కరపత్రం మీద ఇప్పటికే నాకు ఇరవై వ్యాఖ్యలు అందాయి. అవి ఆ సంపాదకుల మీద మరీ వ్యక్తి గత వ్యాఖ్యలు కావడం వల్ల వాటిని నేను అనుమతించలేకపోయాను. అవి ప్రచురణకి అర్హం కానీ భాషలో వున్నాయి కూడా!

ఈ విషయం మీద చర్చ జరగడం అక్కరలేదని నా వుద్దేశం కాదు, లేదా, భావ ప్రకటనా స్వేచ్చ మీద కత్తెర వెయ్యడం కూడా నా వుద్దేశం కాదు. ఈ కరపత్రంలో చర్చించ దగిన విషయాలు వుంటే అవి మర్యాదకరమయిన భాషలో, సహేతుకమయిన వాదనతో చర్చించమని వినయంగా మనవి.

వ్యాఖ్యలు పంపే ముందు అవి ఏ రకంగా చర్చకి దోహదం చేస్తాయో వొక్క సారి ఆలోచించండి. అలాగే, వ్యాఖ్యలు రాసే వారు ఆ వ్యాఖ్యలకి నా నించి సమాధానాలు దయచేసి ఆశించ వద్దు. వాటికి సమాధానాలు ఇవ్వాల్సిన వ్యక్తిని నేను కాదు, సింగిడి రచయితల సంఘం వారు మాత్రమే!


Category: 18 comments

జీవితం అర్ధమయ్యింది ఇక్కడే : పూడిపెద్ది శేషు శర్మ

1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా వచ్చాకే నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది. అమెరికా భాషలో "టీనేజ్ వయస్సు" దాటీ దాటగానే వచ్చి ఈదేశంలో పడ్డాను. జీవితం అంటే ఎటువంటి అవగాహన లేకుండానే పెళ్లి చేసుకుని, భర్తతో భూతల స్వర్గం కాబోలు అనుకుంటూ అమెరికా వచ్చేను. ఇండియా లో పెరిగిన జీవితం అంతా "ఊహా లోకమే"! జీవితం ఎలా ఉండాలో, ఎంత ఆదర్శంతో బతకాలో; జీవితాన్ని ఎలా మలచుకోవాలో అనే ఊహాలోకం తప్ప, అసలు సిసలు జీవితం అంటే ఏమిటో ఎప్పుడూ ఆలోచించ లేదు. ఈదేశం వచ్చిన తరువాత, చుట్టుపక్కల ఉన్న ప్రవాసాంధ్రుల జీవితాలు చూస్తూ ఉంటే, "ఓహో, ఈ దేశంలో మన జీవితాలలో ఇటువంటి సమస్యలు వస్తాయా! మరి అటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలి?" అన్న ఆలోచనలు రావడం మొదలెట్టాయి. ఆ ఆలోచనలే నాలోని ఎమేచూర్ రచయిత్రిని మేల్కొల్పేయి.
మీ ప్రశ్నకు సమాధానం: ఇండియాలో నా జీవితం " స్వప్న జీవితం"; అమెరికా వచ్చిన తరువాత...ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, అసలు జీవితం అంటే ఏమిటో తెలిసింది. రియల్ ఎవేకేనింగ్! ఇప్పటికీ కూడా రోజు రోజుకీ,....నా దృక్పధం లో మార్పు వస్తూనే వుంది.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?
నా దృష్టిలో నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం నాఆలోచనలను చిన్న కధల రూపంలో వ్యక్తీకరణం చేసే మనిషిని. నేను ఇండియా లో పెద్ద రచనలు చేయలేదు. ఈదేశం వచ్చేక మన తెలుగు వారు ఎదురుకుంటున్న సమస్యల గురించి నా భావనల్ని, నా అభిప్రాయాల్ని, నలుగురికి తెలియజేయాలని చిన్ని చిన్ని కధలు వ్రాయటం మొదలుపెట్టా! నా రచనలు, చాలామట్టుకు, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల జీవితాలకు సంభందించినవే. ప్రవాసాంధ్రుల జీవితాల్లో మనకు గోచరిస్తున్న సమస్యలు, వాటిని మనం ఏ దృక్పధంలో చూసి, ఎలా పరిష్కరించుకోవచ్చో అనేదే నా కధల్లో ముఖ్యాంశం. నా కధలు చదివి, అటువంటి ఇరకాటంలో సతమతమవుతున్న మన తెలుగు వారికి ఊరట కలిగించడమే నా ఆశయం.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?
ఇంతకు ముందు చెప్పినట్టు, నేను ఆంధ్రాలో ఉండగా, చేసిన రచనలు...చాలా బుల్లి బుల్లివే. చెప్పుకోదగ్గవి కావు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?
నేను ఎప్పుడో ఆరు నెలలకో, ఏడాదికో కధ వ్రాస్తూ ఉంటాను. నాకు, ఏదైనా క్లిష్టమైన విషయం గానీ, నా హృదయాన్ని తాకిన విషయం గానీ తారస పడితే వ్రాస్తాను; లేదా వ్రాయను. నన్నుగా నేను పెద్ద భవిష్యత్తు వున్నా రచయిత్రిగా ఎప్పుడూ ఆలోచించ లేదు. నేనువ్రాసిన కొన్ని కధలకి, దేశం నలు మూలల నుండి నాతో ఏకీభవిస్తూనో, లేదా విమర్శిస్తూనో నాతో ఫోన్ చేసి ఉద్వేగంతో మాట్లాడినప్పుడే ఒక రచయిత్రిగా నాకు ఆదరణ కలిగిందని నేను భావించేను. ఇక పోతే రచయిత్రిగా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, భవిష్యత్తులోనే తెలుస్తుంది.

కొంచెం గతం, కొంచెం స్వప్నం...కలిస్తే ఫణి!



కథలూ కబుర్ల "పల్లకీ" శ్రీనివాస ఫణి డొక్కాతో కొన్ని కబుర్లు


1. అమెరికా వచ్చాకా జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అమెరికా వచ్చేనాటికి నాకు ఇరవై రెండేళ్ళు. అప్పటికి జీవితం అంటే ఇదీ అనే ఖచ్చితమైన అభిప్రాయం గానీ, ఆలోచన గానీ లేదు. ఏదో, గాలివాటంగా బతకడమే. చదువుకోడానికి మొదట మెంఫిస్ వెళ్ళాను ఒక సెమిస్టరు. అక్కడ విపరీతమైన బెంగ మొదలయ్యింది. నెలకి ఆరొందలు స్కాలర్షిప్పిచ్చేవారు. ఎవరినన్నా ఇంకో మూడొందలు అప్పడిగేసి,ఎయిరిండియాలో వన్ వే టిక్కెట్టు కొనేసుకుని ఇంటికెళిపోదామని వుండేది. తోటల్లో ఎగిరే రామచిలుకని పట్టుకొచ్చి పంజరంలో పెటినట్టనిపించేది. అయితే, ఒక సెమిస్టరయ్యాకా, అట్లాంటా వచ్చేసాను అన్న దగ్గరికి. అప్పట్నించీ, బానే వుండేది. ఏ లోటూ తెలియనిచ్చేవాడు కాదు అన్న. అంచేత బెంగ తగ్గింది. మెల్లగా ఉద్యోగం కూడా రావడంతో, కాస్త ఆత్మ స్థైర్యం, "పరవాలేదు, మనం కూడా దేనికో ఒకందుకు పనికొస్తాం" అనే నమ్మకం కలిగాయి. నెల నెలా జీతం బేంకులో పడుతుంటే, త్రివిక్రముడిలా విశ్వాసం పెరిగిపోయేది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇండియాకెళ్ళి మనవాళ్ళందరినీ చూసుకు రావచ్చును అనే ధైర్యం వచ్చి, బెంగ తగ్గింది.

కడుపు నిండిన బేరం కాబట్టి, వంట దగ్గిరినించీ అన్నీ అన్నే చూసుకునేవాడు కాబట్టి, కాస్త పాటలమీద, కథలూ గట్రా రాయడం మీద మనసు పోయేది. అప్పటికి జీవితం పట్ల బెరుకు పోయి, "అన్న వెళ్ళిన దారిలో ఫాలో అయిపోతే, మన పావు కూడా పంట గడి చేరుకుంటుందనే" గెట్టి నమ్మకం కలిగింది. అప్పట్నించీ జీవితం పైన, భవిష్యత్తు పైన, కాస్త ఆశ, ఆసక్తి మొదలయ్యాయి. జీవితంలో మొట్టమొదటి సారిగా "మర్నాటి"గురించీ, "మరుసటి సంవత్సరం" గురించీ ఆలోచించడం, భవిష్యత్తు గురించి చిన్న చిన్న కలలు కనడం మొదలు పెట్టాను.

2. ఆ మార్పు మీ రచనలలో ఎలా వ్యక్తమయ్యింది? వొకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా ?
మానవ జీవితం పట్ల అవగాహన పెంచుకోవాలనే తపన ఉండేది మొట్టమొదటి రచనల్లో ("సాయంకాలం" కథ). రాను రాను ఆ జనరలైజ్డ్ ఆలోచన నించి, నేను ("నేనూ - నా లేఖినీ" కథ), నా అనుభవాలు ("నేనెరిగిన రైలు ప్రయాణం" కథ), నావాళ్ళు ("కాశిపిల్లి మామ్మ" కథ), నా చుట్టూ ఉన్న జనాలు ( "తెలుగువాడూ - జీవ పరిణామమూ" కథ), అనే ఒక సబ్జెక్టివ్ ధోరణి మొదలయింది. నా జీవితం మీద నాకు కాస్త పట్టు రావటం వల్లా, అన్న ఆసరాతో నాకాళ్ళమీద నేను నిలబడ గలగటం వల్లా, నా దృక్పథంలో వచ్చిన మార్పే, ఈ రచనలకి కారణమని, ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది.

3. ఇక్కడికి వచ్చాకా మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏవిధంగా భిన్నమయినవి?
నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసిన కథలు చాలా తక్కువ. నా మొదటి కథ "సాయంకాలం" - తనలో జరుగుతున్న సంఘర్షణ ( ఈ సృష్టిని అర్థంచేసుకోవాలనే తపన) ని ప్రకృతిలో చూసే ఒక పరిశీలకుడూ, మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే ఒక విద్యార్థీ, అందరికీ మంచే జరగాలని కోరుకునే ఒక స్వాప్నికుడూ - ఇలా సాగిపోతుంది. ఇతనికి తన జీవితాన్ని గురించీ, భవిష్యత్తు గురించీ ఆలోచనే లేదు అప్పటికి. అల్లాగే, "ప్రేమాయణం" అనే ఒక వ్యాసంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టటానికి గల ఐదు కారణాలని చర్చించాను ( ఇది అముద్రిత రచన ). దానిలోనూ అంతే, ఒక జడ్జిగానో, అబ్జర్వర్ గానో, కనబడతాను. అంతా జనరలైజ్డ్ గా ఉంటుంది.

అమెరికాలో, అన్న దగ్గర కాస్త కుదుటబడ్డాకా, బాల్యాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, ఆనాటి అల్లర్లూ, ఆ సరదాలూ, అప్పటి వ్యక్తులూ, చిన్ననాటి అనుభూతులూ, ఈ భావాలన్నీ కథలరూపంలో వచ్చేవి. తరవాత బెంగ తీరిన పిమ్మట, మూడు, నాలుగు పాత్రలతో కథలు రాయడం మొదలుపెట్టాను ("పల్లకీ" కథ అప్పుడు రాసినదే). మధ్య మధ్య చిన్న చిన్న విషయాలమీద నా కామెంటరీ కూడా రాసేవాణ్ణి. తరువాత రెండువేల సంవత్సరానికి కాస్త అటూ, ఇటూగా, సెటైర్లు రాయడం మొదలయింది. మన అందరిలోనూ ఉన్న గుణాలని "ఇవి మంచివి, ఇవి చెడ్డవి" అని చూసే భావం పోయి, మంచి గుణాలని మెచ్చుకుంటూ, అంత మంచివి కానివాటిని చూసి కాస్త నవ్వుకుంటూ, "నథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్, టేకిటీజీ" అనుకుంటూ, హాస్యం, వ్యంగ్యం కలిసిన రచనలు చేయటం కాస్త అలవాటయింది. అల్లా చాలా సెటైర్లు రాసాను, ఇంకా రాస్తున్నాను.

4. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగు రచయిత / కవి అనేది ఒక అంతరించిపోతున్న స్పీషీసు. మనసులో కాస్త తడి, మనిషన్న వాడిమీద ప్రేమ, విశ్వాసం, తెలుగు మీద కాస్త మమకారం, మాటల్లో కాస్త చమత్కారం - ఈ లక్షణాలున్న రైటర్సు ఇప్పటికే అతితక్కువ, ప్రపంచం మొత్తం మీద. ఇహ భవిష్యత్తు గురించి చెప్పనక్కరలేదు. మన సంతృప్తి కోసం రాసుకోవడం, పుస్తకాలు అచ్చేసుకోవడం. ఎవరన్నా మెచ్చుకుంటే సంబరపడిపోవడం, అంతవరకే. దీనివల్లేదో భాష ఉద్ధరింపబడుతుందని గానీ, మరో తరం వారో, ఆ పై తరం వారో మన కథలు చదివేసి "అన్నన్నా, మనం ఫలానా వారి సమకాలీకులుగా పుట్టి వుంటే ఎంత బాగుణ్ణు" అనేసుకుంటారనే వెఱ్ఱి అపోహలు గానీ నాకు లేవు.

నామట్టుక్కు నాకు మనుషులంటే ఇష్టం. వాళ్ళ మనసుల్ని తాకడం ఇష్టం. భేషజాల తెరల్ని దాటుకుని వెళ్ళి, అందరిలోనూ ఉండే అమాయకమైన పసిపిల్లవంటి హృదయాలతో కబుర్లాడడం ఇష్టం. నాకు నచ్చినన్నాళ్ళు రాస్తాను. ఎవరన్నా మెచ్చుకున్నన్నాళ్ళు రాస్తాను. ఓపికుంటే అచ్చేయించుకుంటాను. చదువుతానంటే ఇస్తాను.

ఇది ఇంటర్నెట్టు యుగం కాబట్టి, ఓ అరవయ్యో, వందో ఏళ్ళ తరువాత, వీకీపీడియా లోనో, మరొహ సైటులోనో, "ఫణి డొక్కా" అని సెర్చ్ చేస్తే, రెండు డేట్లు, నేను రాసిన పుస్తకాల పేర్లూ ఉండచ్చు. అప్పుడెవరన్నా వెఱ్ఱి బాగులవాడు తెలుగులో పరిశోధనా గ్రంధం రాస్తూంటే, నా పేరూ జత చెయ్యొచ్చు. ఈ ఋణానుబంధం అంతవరకే.
Category: 6 comments
Web Statistics