Thursday, December 6, 2012

చేరన్ రుద్రమూర్తి/ వొక తీరం:మూడు మాటలు



1

కెరటమై పైకి ఎగసీ ఎగసీ

నురుగులా చనిపోయింది

నీరు.

2

ఆమె తీరం వైపు దూసుకుపోతోంది;

నేనింకా

కెరటాల్లోనే సతమతమైపోతున్నా.

3

సూర్యుణ్ణి మింగేసింది సముద్రం

చీల్చి, సూర్య రక్తాన్ని

మబ్బులమీదికి రువ్వి.

 

వొడ్డు మీద

ఆరిపోతుంది  పగలు,

నెమ్మదిగా

రాలిపడుతుంది రాత్రి.

 

ఇక కెరటాల మాట అంటావా,

అవి ఇంకా జీరాడుతూనే వున్నాయి

దిగులుగా.

(అనువాదం: అఫ్సర్)

 

No comments:

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన:  ఎమ్వీ రామిరెడ్డి  -   ఈమాట నుంచి--   ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...