Thursday, December 6, 2012

చేరన్ రుద్రమూర్తి/ వొక తీరం:మూడు మాటలు



1

కెరటమై పైకి ఎగసీ ఎగసీ

నురుగులా చనిపోయింది

నీరు.

2

ఆమె తీరం వైపు దూసుకుపోతోంది;

నేనింకా

కెరటాల్లోనే సతమతమైపోతున్నా.

3

సూర్యుణ్ణి మింగేసింది సముద్రం

చీల్చి, సూర్య రక్తాన్ని

మబ్బులమీదికి రువ్వి.

 

వొడ్డు మీద

ఆరిపోతుంది  పగలు,

నెమ్మదిగా

రాలిపడుతుంది రాత్రి.

 

ఇక కెరటాల మాట అంటావా,

అవి ఇంకా జీరాడుతూనే వున్నాయి

దిగులుగా.

(అనువాదం: అఫ్సర్)

 

No comments:

అలజడికి అక్షర రూపం- సాహిల్

  -పి. జ్యోతి "సాహిల్ వస్తాడు" కథా సంకలనంలో అప్సర్ గారి 11 కథలున్నాయి. ముస్లిం మైనారటి సమస్యలపై వారి దృక్పథంతో రాసిన కొన్ని కథలు ఇ...